---Advertisement---

WIHG Recruitment 2026: రాత పరీక్ష లేకుండా ₹60,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు | వివరాలు మరియు దరఖాస్తు విధానం

By Charan

Published on:

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

మీరు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందాలని చూస్తున్నారా? కేవలం డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అరుదైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. కేవలం ఒక చిన్న స్కిల్ టెస్ట్ ద్వారానే శాశ్వత ఉద్యోగాలు పొందవచ్చు. ప్రారంభంలోనే నెలకు రూ.60,000 పైగా జీతం లభించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ వివరాలు

భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) పరిధిలో పనిచేస్తున్న వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (Wadia Institute of Himalayan Geology) అనే కేంద్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్త సంస్థలో ఈ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి. ఇవి శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. భారతీయ పౌరులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 26
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 25
  • దరఖాస్తు కాపీని ఈమెయిల్ ద్వారా పంపడానికి చివరి తేదీ: మార్చి 4

అర్హతలు మరియు వయోపరిమితి

  • అర్హత (Qualification): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి. ఎలాంటి పని అనుభవం అవసరం లేదు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నప్పటికీ, అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం డిగ్రీ అర్హత మాత్రమే తప్పనిసరి.
  • వయోపరిమితి (Age Limit): జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

జీతం వివరాలు

అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే రూ. 34,800 ఉంటుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం డి.ఎ. (Dearness Allowance), హెచ్.ఆర్.ఎ. (House Rent Allowance), ట్రావెలింగ్ అలవెన్సులు (Traveling Allowances) వంటి ఇతర అలవెన్సులు కలుపుకొని, ప్రారంభంలోనే నెలకు రూ.60,000 పైగా జీతం లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి సాధారణ స్కిల్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తారు, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉండదు. ఫైనల్ సెలక్షన్ స్కిల్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Sign Up Now’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, పాస్‌వర్డ్ (మీరే సృష్టించుకోవాలి), క్యాప్చా వివరాలు నమోదు చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత, లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత, దరఖాస్తు కాపీని ప్రింటవుట్ తీసుకొని, మీ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లపై గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి, వాటిని స్కాన్ చేసి వారికి ఈమెయిల్ ద్వారా పంపాలి. ఈమెయిల్ పంపాల్సిన చిరునామా: recruitment.in. సబ్జెక్ట్ లైన్‌లో ‘Application for the post of [పోస్ట్ పేరు] – [మీ పేరు]’ అని స్పష్టంగా పేర్కొనాలి. పోస్ట్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ (PWD) అభ్యర్థులు మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య గమనికలు

ఈ ఉద్యోగాలు పర్మనెంట్ మరియు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ప్రారంభంలో పోస్టింగ్ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఉంటుంది, తరువాత ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్ అవకాశం ఉంటుంది. డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.

---Advertisement---

Leave a Comment

WhatsApp

📢 తాజా జాబ్స్ కోసం Join అవ్వండి!

ప్రతి రోజు తాజా ఉద్యోగ సమాచారం పొందండి.